ఒకప్పుడు సినిమాల విషయంలో మన హీరోలు పోటీ పడేవారు. ఇప్పుడు బుల్లితెరపై కూడా హీరోల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులతో పాటు పలు కార్యక్రమాలని సినిమా స్టార్స్ హోస్ట్ చేస్తుండడంతో ఈ షోస్కి టీఆర్పీ తెచ్చిపెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి రామ్ చరణ్ గెస్ట్గా హాజరుకాగా,ఈ ఎపిసోడ్ మంచి టీఆర్పీ రాబట్టింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీన (సోమవారం) ప్రసారం కాబోతున్న షో కోసం ఏకంగా రాజమౌళి, కొరటాల శివలను రంగంలోకి దించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. టీఆర్పీ మీటర్ ను బద్దలుకొట్టాడనికి తారక్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు సన్నద్ధం అవుతున్నట్టుగా సమాచారం. గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరైన విషయం తెలిసిందే. ఇండస్రీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ మధ్య మంచి రిలేషన్ ఉంది.