భూపాలపల్లి, ఏప్రిల్ 1 : రెండు నెలల్లో భూపాలపల్లిలో 10 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఈ.సీహెచ్ నిరీక్షణ్రాజ్ తెలిపారు. ఆలోగా మిగిలిన విద్యుత్ప్లాంట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తి, సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు, కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఏరియా స్థాయి అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం రూ.200 కోట్లతో భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఉద్యోగుల నివాసార్థం డబుల్బెడ్రూం సౌకర్యం కలిగిన 994 క్వార్టర్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో కంపెనీ క్వార్టర్లలో ఏసీ అమర్చుకున్న ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన పనులు 85 శాతం పూర్తయ్యాయన్నారు.
బొగ్గు రవాణాకు ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో ైస్లెడింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ప్రధాన మాగజైన్ ఏర్పాటుకు కార్పొరేట్ అనుమతులు వచ్చాయన్నారు. కేటీకే ఓసీపీ-3 గనిలో 2020 జూలై 15న మట్టి తవ్వకపు పనులు ప్రారంభమై, 2020 అక్టోబర్ 12న బ్లాస్టింగ్ పనులు కూడ ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటి వరకు 92 లక్షల 36వేలకు పైగా క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీసినట్లు ఆయన వివరించారు. మార్చి 5న బొగ్గు ఉత్పత్తి ప్రారంభించి ఇప్పటి వరకు 12,032.82 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. లాక్డౌన్, భూగర్భ గనులకు లే-ఆఫ్ ప్రకటించడంతో పాటు కార్మికుల గైర్హాజర్ శాతం పెరగడం వల్ల 2020-21లో భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోలేక పోయామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికతో ముందుకు సాగి 44.90 టన్నుల సంస్థ లక్ష్యాన్ని సాధించాలని జీఎం నిరీక్షన్రాజ్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చుడండి
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న స్పీకర్ పోచారం
చాయ్లో ఎండ్రిన్ గుళికలు.. మహిళ మృతి