ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నారు. నేటి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం కరోనా జాగ్రత్తల నడుమ రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. దుబాయ్ షెడ్యూల్ తర్వాత, చాలా గ్యాప్ తీసుకున్న మేకర్స్ ఈ రోజు నుండి సెకండ్ షెడ్యూల్ మొదలు పెడుతున్నారు. ఈ షెడ్యూల్లో చిత్ర దర్శకుడు పరశురాం కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తర్వాత తరువాత ‘సర్కారు వారి పాట’ టీం చిన్న విరామం తీసుకుని మేజర్ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనున్నారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. . మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్ల సమయంలో ‘సర్కారు వారి పాట’ కోసం తాను మూడు పాటలు కంపోజ్ చేశానని తమన్ చెప్పిన విషయం విదితమే. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని థమన్ అన్నారు. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.