ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజర్ ఎపిసోడ్కి రామ్ చరణ్ హాజరై తెగ సందడి చేయగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి-కొరటాల కూడా రంగంలోకి దిగారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో ఎన్టీఆర్ ..నేనే బాస్ ఇక్కడ, ‘లొకేషన్ నాది డైరెక్షన్ నాది అంటూ భయపెట్టించారు.అతి త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోకి హాజరు కానున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజమేనని ఈ ఫొటో ద్వారా అర్ధమైంది.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి మహేష్ గెస్ట్గా హాజరు కాగా, దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్ర షూటింగ్ నిన్న కంప్లీట్ అయ్యిపోయిందట. అలాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని మేకర్స్ దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది