మహేష్ బాబు తన పుట్టిన రోజు అయినా పట్టించుకుంటాడో లేదో కానీ.. కచ్చితంగా తన తండ్రి కృష్ణ బర్త్ డే మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా తన నాన్న పుట్టిన రోజు నాడు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ అభిమానులకు చెప్తుంటాడు. ప్రతీ ఏడాది ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. ముఖ్యంగా కరోనా సమయంలోనూ తన సెంటిమెంట్ వదలడం లేదు. ఈ సారి కూడా మే 31 కృష్ణ పుట్టిన రోజు నాడు తన సినిమాలకు సంబంధించిన మూడు అప్ డేట్స్ చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజుల పాటు జరిగింది. ఈ మధ్యే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను గతేడాది మహేష్ పుట్టిన రోజుకు విడుదల చేసారు. ఇప్పుడు కృష్ణ పుట్టిన రోజుకు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి ఈ చిత్ర షూటింగ్ చేసారు. దాంతో పాటు త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేయబోయే SSMB 28 సినిమాకు సంబంధించిన అఫీషియల్ లాంఛింగ్ కూడా అదే జోరు జరగబోతుందని తెలుస్తుంది.
ఓ వైపు సర్కారు వారి పాట ఫస్ట్ లుక్.. మరోవైపు మేకింగ్ వీడియో.. ఇంకోవైపు త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్.. ఇలా అన్నీ ఒకేరోజు చెప్పబోతున్నాడు సూపర్ స్టార్. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్స్ తర్వాత ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి కూడా కచ్చితంగా మ్యాజిక్ చేస్తామంటున్నాడు త్రివిక్రమ్. ఇది తెలిసి పండగ చేసుకుంటున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన కరోనా బ్రేక్ లో ఉన్నాడు. త్వరలోనే మిగిలిన వివరాలు కూడా బయటికి రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
బ్లాక్లో రెమ్డెసివర్ ఇజక్షన్లు..ముగ్గురి అరెస్ట్
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర్
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం