శ్రీరామ్, సంచిత పడుకునే జంటగా నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకుడు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ను కథానాయకుడు అల్లరి నరేష్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. తెలంగాణలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజయవంతం కావాలి. దర్శకుడికి పేరుతో పాటు నిర్మాతలకు డబ్బుల్ని తెచ్చిపెట్టాలి’ అని తెలిపారు.‘ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్తో ప్రపంచం పోరాటం చేస్తోంది. వైరస్ లాంటి అదృశ్యశక్తితో ఓ యువకుడు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చక్కటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ను పంచే చిత్రమిది. అందుకే ఒటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదలచేయబోతున్నాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ టేక్మాల్ శ్రీకర్రెడ్డి, కుమారస్వామి సంగ, కొయ్యడ నితిన్, హ్యారీ సిల్వెస్టర్, వాసు తదితరులు పాల్గొన్నారు.