స్వగ్రామం ఏపీలోని బుర్రిపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటుచేసి అగ్రహీరో మహేష్బాబు మంచి మనసును చాటుకున్నారు. సొంత ఊరు బుర్రిపాలెంను మహేష్బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తన తండ్రి, సీనియర్ హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం బుర్రిపాలెం ప్రజల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు మహేష్బాబు. ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ‘మనం సాధారణ జీవితం గడపడానికి టీకా ఆశాకిరణం లాంటిది. బుర్రిపాలెం ప్రజలు ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని క్షేమంగా ఉండటానికి ఇది నా వంతు ప్రయత్నం. కొవిడ్ టీకా వేయించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి’ అని మహేష్బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.