కథానాయకుడు మహేష్బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని స్విమ్మింగ్లో తన ప్రావీణ్యతను చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్కు సంబంధించి తన వయసు విభాగంలోని టాప్ 8 స్థానాల్లో ఒకరిగా నిలిచారు గౌతమ్. ఈ విషయాన్ని మహేష్బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేస్త్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘2018 నుంచి గౌతమ్ స్విమ్మింగ్ సాధన చేస్తున్నాడు. స్విమ్మింగ్లో చక్కని మెలకువలను, నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. బటర్ఫ్లై ఫ్రీ ైస్టెల్లో ఏకధాటిగా మూడు గంటల్లో ఐదుకిలోమీటర్లు స్వీమ్ చేయగలడు’ అని నమత్ర పేర్కొన్నారు.