వికారాబాద్, ఏప్రిల్ 19 : అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ ఎస్ఐ వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మెడిక్యూర్ దవాఖానలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి అగ్నిమాపక పరికరాలపై, జరుగు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దవాఖానలో ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ అమర్చుకోవాలన్నారు. కాలం చెల్లిన అగ్నిమాపక పరికరాలు ఉంటే తొలగించి నాణ్యమైనవి ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయిరెడ్డి, బుగ్గయ్య, తిరుపతిరెడ్డి, శేఖర్, గౌస్ పాల్గొన్నారు.
అవగాహన ఉంటే ప్రమాదాలను ఎదుర్కోవచ్చు
ప్రమాదాలపై అవగాహన ఉంటే ఎదుర్కోవడం సులభతరం అవుతుందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. సోమవారం అగ్ని ప్రమాదాల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని రాఘవేంద్ర, ప్రభుత్వ దవాఖానల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలను నివారించుకునేందుకు దవాఖానల్లో ఆటోమెటిక్ స్ప్రింక్లర్స్ ఉపయోగించాలని, క్షేమంగా తప్పించుకునేలా తగు ప్రదేశాలు అందుబాటులో ఉంచుకోవాలనే తదితర అంశాలను సూచించారు. ప్రమాదాల నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్, కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాఘవేంద్ర దవాఖన సిబ్బంది దాసప్ప యాదవ్, ఫైర్ సిబ్బంది సయ్యద్ మతీన్, ఆనందం, సునీల్కుమార్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
దక్షత కనిపిస్తుంటే దీక్షలు నమ్మేదెవరు?