లక్నో : ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేళ.. 45 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే అతను నివసిస్తున్న గ్రామపంచాయతీని మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో అతను పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మంచి ముహుర్తం లేనప్పటికీ మార్చి 26న పెళ్లి చేసుకున్నాడు.
బాలియా జిల్లాలోని కరణ్చప్రా గ్రామానికి చెందిన హథీ సింగ్(45) దశాబ్ద కాలంగా సోషల్ సర్వీసు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనను విజయం వరించలేదు. గ్రామం అభివృద్ధికి పాటు పడుతున్న అతను ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, సహచరుల సూచన మేరకు పెళ్లి చేసుకున్నాడు. కచ్చితంగా హథీ సింగ్ భార్యనే గెలిపిస్తామని గ్రామస్తులు అంటున్నారు.
ఈ సందర్భంగా హథీ సింగ్ మాట్లాడుతూ.. తన గ్రామానికి మూడో దశలో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేనప్పటికీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన భార్య డిగ్రీ పట్టభద్రురాలు అని తెలిపాడు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని హథీ సింగ్ పేర్కొన్నాడు.
ఇవీ కూడా చదవండి..