మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్నోటీస్ పేరుతో మహేష్బాబు సరికొత్త లుక్ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్తపోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నారు. చుట్టూ కార్లు, బైక్లతో అదొక పోరాటస్థలిలా కనిపిస్తోంది. రైతు సమస్యలు, సంపన్నుల బ్యాంకు రుణాల ఎగవేత అంశాల్ని స్పృశిస్తూ సామాజిక సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, రచన-దర్శకత్వం: పరశురామ్