ఇండస్ట్రీలో 41 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ బాబు

తన తండ్రి కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఎదిగాడు మహేష్ బాబు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాని అంతకముందు బాల నటుడిగా పలు చిత్రాలు చేశారు. మహేష్ మొట్టమొదటి సారిగా నీడ అనే చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. దాసరి నారాయణరావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 29,1979న విడుదల కాగా, నేటితో 41 ఏళ్లు పూర్తి చేసుకుంది.
నీడ చిత్రం నటుడిగా మహేష్కు తొలి చిత్రం కాగా, ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 41 ఏళ్లు అవుతుంది.ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో # 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్ట్యాగ్ను ఫుల్గా ట్రెండ్ చేస్తూ ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీడ చిత్రంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. ఇది ఆయనకు రెండవ చిత్రం. కాగా, మహేష్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, వచ్చే ఏడాది సర్కారు వారి పాటతో పలకరించనున్నాడు. జనవరి నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- పది నిమిషాల్లోనే పాన్ కార్డు పొందండిలా..!
- ఎన్టీఆర్కు, చంద్రబాబుకు అసలు పోలిక ఉందా?: కొడాలి నాని
- ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు