తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోల్లో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. ఎందుకంటే ఈయనకు హిట్టు ఫ్లాపులతో పని లేదు. టాలెంట్ ఉంది కాబట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా చేతిలో కనీసం మూడు సినిమాలతో బిజీగా ఉంటాడు నాని. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్రిల్ 23నే రావాల్సింది కానీ కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ చేసారు. ఇక ఈ సినిమాను ఓటిటిలో ఊహించొద్దు అని దర్శక నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు. నాని గత సినిమా వి కూడా ఓటిటిలోనే వచ్చింది. అయితే తన 25వ సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతుందని ఈయన ఊహించలేదు.
దాంతో మళ్లీ ఓటిటి అనే పదమే పూర్తిగా వదిలేసాడు నాని. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ శ్యామ్ సింగ రాయ్ ఒకటి.. మరోటి అంటే సుందరానికి. ఇందులో శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. కోల్ కత్తా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం 50 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కోరమీసంతో కొత్తగా కనిపిస్తున్నాడు నాని. శ్యామ్ సింగ రాయ్ బడ్జెట్ భారీగానే ఉన్నా కూడా నాన్ థియెట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు 30 కోట్లు రికవర్ అయ్యాయని తెలుస్తుంది. అంటే బడ్జెట్లో దాదాపు 60 శాతం వచ్చేసిందన్నమాట. ఈ సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమాను ఒప్పుకున్నాడు నాని.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో వరస విజయాలు అందుకున్న వివేక్ ఆత్రేయ.. నాని సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి ఈమె పరిచయం అవుతున్న సినిమా ఇది. నాని ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్లుగానే డేట్స్ అడ్జస్ట్ చేయడమే కాకుండా కరోనా జాగ్రత్తలు కూడా అంతే జాగ్రత్తగా పాటిస్తున్నారు. ఏదేమైనా కూడా కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితం అయితే మన నాని మాత్రం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఫ్యాన్స్ జాగ్రత్తలు చెప్తూనే.. పండగ చేసుకుంటున్నారు.
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..