శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. అనూ ఇమ్మాన్యుయేల్, అదితిరావ్ హైదరీ కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో థియేటర్స్లో విడుదల చేయబోతున్నారు. గురువారం శర్వానంద్, సిద్ధార్థ్ క్యారెక్టర్స్ మోషన్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరు కోపోద్రిక్తులుగా ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ తుపాకీ చేతబూని ఉన్నారు. ‘భావోద్వేగ ప్రధానంగా నడిచే కథ ఇది. ప్రేమ, యాక్షన్ అంశాల కలబోతగా ఉంటుంది. శర్వానంద్, సిద్ధ్దార్థ్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్తోట, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.