టాలీవుడ్ హీరో రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి తనలోని డిఫరెంట్ యాంగిల్ ను చూపించేందుకు రెడీ అవుతున్నాడు రామ్. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ లైమ్ లైట్ లోకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడన్న వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
మాధవన్ ఇప్పటికే యువ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా..మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు అనుష్క, అంజలి కాంబోలో వచ్చిన నిశ్శబ్దంలో కూడా అలాంటి పాత్రే చేశాడు. మరి ఈ సారి ఎనర్జిటిక్ హీరో రామ్ కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడన్న న్యూస్ సినిమాలపై అంచనాలను పెంచేస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై సందడి చేస్తుందా..? చూడాలి.
ఇవి కూడా చదవండి..
గడ్డంతో నాగచైతన్య..థాంక్యూ లుక్
మహేశ్ బాబు చిత్రంలో వకీల్ సాబ్ భామ..?
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్