టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ మేకప్ ఛీఫ్ సి. మాధవరావు సతీమణి సుబ్బ లక్ష్మమ్మ కరోనాతో కన్నుమూశారు. నెల రోజుల క్రితం మాధవరావు ఆయన సతీమణి చెన్నైకి వెళ్లగా, అక్కడ వారు కరోనా బారిన పడ్డారు. మాధవరావు కోలుకున్నప్పటికీ, సుబ్బ లక్ష్మమ్మ కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు పేర్కోన్నారు. మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మాధవరావు సతీమణి కన్నుమూసారన్న విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.