MAA Elections | మా కార్యవర్గ ఎన్నికలపై ఆరోపణలు.. ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల అధికారి కృష్ణమోహన్పై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు గుప్పించింది. ఆయన బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకెళ్లారని పేర్కొంది.. మా ఓట్ల లెక్కింపులో ఆదివారం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్గా పోటీ చేసిన అనసూయ గెలిచినట్లు వార్తలొచ్చాయి. సోమవారం ఆమె ఓడిపోయిందని తేల్చారు. దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
దీనిపై కృష్ణమోహన్ రియాక్టయ్యారు. తాను ఇంటికి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ తాను బ్యాలెట్ పేపర్ల బాక్సులకు వేసిన తాళాల తాళం చెవులు మాత్రమే తీసుకెళ్లానని వివరణ ఇచ్చారు. అనసూయ గెలిచినట్లు ఆదివారం వచ్చిన వార్తలు అబద్ధం అన్నారు.