ఆట సందీప్, ప్రాచీ, జ్యోతి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యు టూ’. శ్రీకాంత్ కీర్తి నిర్మాత. యోగికుమార్ దర్శకుడు. ట్రైలర్ను ఇటీవల విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు యోగి మాట్లాడుతూ ‘ప్రేమకు వయోభేదాలు, వైవాహిక బంధాలు అడ్డుకాదని చాటిచెప్పే చిత్రమిది. పళ్లైన వాళ్లు ప్రేమలో పడితే జరిగే పరిణామాలేమిటో ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఐదు పాత్రలతో చక్కటి సందేశాత్మక చిత్రంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీలు ఉండవు’ అని తెలిపారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిదని జ్యోతి చెప్పింది. ఆట సందీప్ మాట్లాడుతూ ‘నా భార్య జ్యోతితో కలిసి ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నటనాపరంగా తను నాకు చక్కటి సలహాలు ఇచ్చింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాచీ, శ్యామ్, సాకేత్ తదితరులు పాల్గొన్నారు.