మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. మానవ- జంతు సంఘర్షణ నివారణకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చైర్మన్గా నియమించిన సూచనల కమిటీ శనివారం అరణ్యభవన్లో సమావేశమైంది. పులుల దాడులతో మనుషుల మరణాలను అరికట్టే దిశగా చేపట్టే చర్యలు, మానవ-జంతు సంఘర్షణ నివారణకు ఓ విధానాన్ని రూపొందించడం, క్రూరమృగాల దాడుల్లో మనుషులు మృతి చెందటం, గాయపడటం, పెంపుడు జంతువుల మృతి, పంటనష్టం పరిహార చెల్లింపుల సవరణ తదితర అంశాలపై కమిటీ చర్చించింది. మానవ- జంతు సంఘర్షణ నివారణకు మూడు నెలలలోపు సమగ్ర నివేదిక రూపొందించిప్రభుత్వానికి అందించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, మాజీ ఎమ్మెల్యే జీ అరవింద్రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ సిద్ధానంద్ కుక్రేటి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం సభ్యుడు మురళీ, డబ్లూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు అనిల్కుయార్ ఏపుర్, ఫరీదాతంపాల్, పర్యావరణ నిపుణులు రాజీవ్మాథ్యూ, ఇమ్రాన్ సిద్ధిఖీ, వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.