వాషింగ్టన్: భారతదేశంలో కరోనా రెండోవేవ్ సృష్టిస్తున్న విలయంతో పౌరులంతా అగ్గల్లాడుతున్నారు. దీనిపై స్పందించిన గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. కష్టాల్లో చిక్కుకున్న భారతీయులకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది.
క్షేత్ర స్థాయిలో మహమ్మారి నివారణకు జరుగుతున్న కార్యక్రమాలకు విరాళాల రూపంలో తమ వంతు సహకారం అందిస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.
‘భారతదేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో వైద్యులు, కార్మికులు, ాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరిపైనే మా ఆలోచనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చేపట్టే సహాయ చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇవ్వనుంది’ అని టిమ్ కుక్ ట్వీట్ చేశారు.
అయితే,ఆపిల్ నుంచి ఏ రూపంలో, ఎంత మొత్తంలో సాయం అందుతున్నదన్న విషయమై ఆపిల్ నుంచి ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వానికే నేరుగా విరాళం అందించడంపై వివిధ వర్గాలతో సమాలోచిస్తున్నట్లు సమాచారం.
అంతకుముందు భారత్లో కరోనా పరిస్థితులను చూసి టెక్ కంపెనీల పలువురు భారత సంతతి సీఈఓలు తల్లడిల్లిపోయారు. మాతృదేశానికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు.
సహాయ చర్యల నిమిత్తం గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్లో పరిస్థితులను చూసి తన గుండె బద్దలైందన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. సహాయ చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని తెలిపారు.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్కు చోటా రాజన్ తరలింపు
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
మహారాజా కోసం స్పైస్ జెట్ కూడా.. ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలంటూ..!
టెకీలకు ఊరట : ఉద్యోగులకు అదనంగా వేతనంతో కూడిన సెలవలు