నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్స్టోరి’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 16న విడుదలకావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా ఉధృతి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘సినిమాపై అందరూ పాజిటివ్గా ఉన్నారు. మ్యూజికల్గా పెద్ద హిట్ అయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇంకా కేసులు పెరిగేలా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమాను విడుదల చేయడం శ్రేయస్కరం కాదనిపించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరి సూచనల్ని పరిగణనలోకి తీసుకొని విడుదల వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటి స్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో నాగచైతన్య, నిర్మాతలు నారాయణ్దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు.