అమరావతి : అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందకనే మృతి చెందారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. దవాఖాన ఎదుట మృతుల కుటుంబాలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో బాధిత కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. సిబ్బంది నిర్లక్ష్యంతోనే కుటుంబీకులు మృతి చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.