ఒకవైపు కరోనా మహమ్మారితో భయపడి చస్తుంటే మరోవైపు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. బుల్లితెర నటుడు నిర్లక్ష్యం చేయడం వలన కాలుని కూడా పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. వివరాలలోకి వెళితే ప్రముఖ ధారావాహిక ‘జోధా అక్బర్’తో పాటు ‘యే హై మొహబ్బతే’, ‘సీఐడీ’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి సీరియళ్లలో నటించిన బుల్లితెర నటుడు లోకేంద్ర సింగ్ రాజవత్ రక్తపోటు, తీవ్ర ఒత్తిడి, డయాబెటిస్ వంటి సమస్యల కారణంగా కాలు కోల్పోయాడు.
పదేళ్ల క్రితం లోకేంద్ర సింగ్ రాజవత్ మధుమేహం బారిన పడ్డాడు. ఆ సమయంలో తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ వచ్చాడు. దాంతో కుడి పాదంలో చిన్న కణితి ఏర్పడింది. దానిని పెద్దగ పట్టించుకోలేదు. అది ఇన్ఫెక్షన్లా మారి కండరాలలోని మాంసాన్ని తినేసింది. దీంతో మోకాలి వరకు కాలును తీయక తప్పలేదు.
కరోనా తర్వాత రాజవత్కి అవకాశాలు చాలా తగ్గాయట. దీంతో ఆర్ధిక సమస్యలు ఏర్పడ్డాయి. సింటా(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తో పాటు కొందరు నటీనటులు సాయం చేస్తున్నారు. నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ మనోధైర్యాన్ని అందిస్తున్నారు’ అని ఆయన తెలిపాడు.