యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగాయి. అంతకు ముందు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. స్వామివారి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణల మధ్య కన్యా దానం తంతు వేడుకగా జరిగింది. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.