బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో మంగళవారం ఎపిసోడ్ చాలా వాడివేడిగా జరిగింది. నామినేషన్ కోసం రెండు టీంలుగా విడిపోయిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోను అలానే ఆడారు. ‘పంథం నీదా నాదా’ అనే టాస్క్లో భాగంగా ముందు దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ కోసం హౌజ్మేట్స్ బాగానే కుస్తీలు పడ్డారు.
యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్కి సంబంధించిన డగౌట్స్ ఉంచగా, నక్క టీమ్( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్)కు సంబంధించిన డగౌట్స్లో గద్ద టీమ్( లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్(పిల్లోస్) ఉంచారు. ఇక గద్ద టీమ్ డగౌట్స్లో నక్కటీమ్కు చెందిన పిల్లోస్ ఉన్నాయి. డగౌట్స్లో పిల్లోలు ఎవరు ఎక్కువ నింపుకుంటే అవి ప్లాగ్స్గా లెక్కించబడతాయి. ఎవరి దగ్గర ఎక్కువ ప్లాగ్స్ ఉంటాయో వారే విజేతలు.
పిల్లోస్ లాక్కునేందుకు కంటెస్టెంట్స్ నానా రచ్చ చేశారు.దెబ్బలు తగులుతాయి అని మరచి గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒకానొక సందర్భంలో పిల్లోస్ లాక్కునేందుకు సిరి షర్ట్లో సన్నీ చేయి పెట్టాడంటూ ఆమె పెద్ద గొడవ చేసింది. దానికి సన్నీ నేను అలా చేయలేదని అన్నాడు . ఇక టాస్క్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో లోబో కళ్లు తిరిగి కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని మెడికల్ రూంకి తరలించారు.
ఇక టాస్క్లో భాగంగా రవి- విశ్వ మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత రవినే వెళ్లి విశ్వకు సారీ చెప్పడం జరిగింది. మొత్తానికి ‘దొంగలున్నారు జాగ్రత్త’టాస్క్ చాలా రసవత్తరంగా సాగగా, రెండో టాస్క్ ‘సాగరా సోదరా’ నేటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది. ఇందులో గొడవలు భీకర స్థాయిలో ఉంటుందని ప్రోమోని బట్టి అర్ధమవుతుంది.