కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలతో తాము పని చేస్తామంటూ పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తమిళనాడులోని మనపక్కం ఏరియాలో కరోనా బాధితులకోసం ఆశ్రమం ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవానికి ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
లింగుస్వామి తన సోషల్ మీడియాలో ఆశ్రమం ప్రారంభోత్సవం ఫొటోలని షేర్ చేస్తూ.. కరోనా బాధితుల సహాయార్థం మనపక్కం ఏరియాలో ఆశ్రమం ప్రారంభించడానికి సహకరించిన సోదరుడు సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ ,మంత్రి టిఎన్ బరాసన్ , హీరోయిన్ కీర్తిసురేష్ లకు ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం లింగుస్వామి టాలీవుడ్ హీరో రామ్ తో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.