రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లెహరాయి’. ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై మద్దినేని శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రామకృష్ణ పరమహంస దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస..’ అనే లిరికల్ గీతాన్ని విడుదల చేశారు.
ఈ పాటను ఘంటాడి కృష్ణ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రేవంత్ పాడారు. ‘తీపితో తేల్చి చెప్పా..తొలి తీపి నీ పలుకని, తారనే పిలిచి చూపా.. తొలి తార నీ నవ్వని’..అంటూ చక్కటి భావాలతో సాగిందీ ప్రేమ గీతం.