న్యూఢిల్లీ : భారతీయులం అంతా కలిసి ఉండి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ సూచించారు. మనమంతా కలిసి ఉంటే బలపడతాం.. విడిపోతే కష్టాలు ఎదుర్కొంటాం అనే సామెతను మరిచిపోవద్దన్నారు. దేశం ఒకటిగా ఉండాలి, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మనమంతా తేడాలను వదిలి ఐక్యంగా ఉండాలని చెప్పారు.
రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించిన “పాజిటివిటీ అన్లిమిటెడ్” కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ టెలివిజన్ చేసిన బహిరంగ ప్రసంగంలో ప్రేమ్జీ మాట్లాడారు. “మనం అన్నిరంగాల్లో చాలా వేగంతో పనిచేయాలి. ఈ చర్యలు మంచి శాస్త్రంపై ఆధారపడి ఉండాలి. సైన్స్ అండ్ ట్రుత్.. ఈ రెండే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగల పునాదులు. వీటి వల్లనే భవిష్యత్లో పునరావృతం కాకుండా చూసుకోవచ్చు” అని పేర్కొన్నారు.
మహమ్మారి వల్లనే కాకుండా ఆర్థిక పతనానికి దారితీసే అత్యంత దుర్బలమైన దుస్థితిపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని అన్నారు. గ్రామాల్లో పేదవారి పరిస్థితి మరింత హృదయ విదారకంగా ఉన్నదని, బలహీనంగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి వారిని పైకి తీసుకురావాలని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ మహమ్మారి నుంచి బయటపడుతామని, అలాగే సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
అతి ఆత్మవిశ్వాసమున్న యువతే కొవిడ్ సూపర్ స్ప్రైడర్లు : సర్వే
మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా..!
1 ఎంజీలో టాటా 65 శాతం వాటా కొనుగోలు
ఎన్నికల్లో ఓడిన మంత్రికి ఉన్నత పదవి.. టీఎంసీలో చేరిన వామపక్ష నేతలు
నౌకలు నిలిచిపోకుండా సూయెజ్ కాలువలో పనులు
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..