నిజామాబాద్ : రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అత్యవసర వస్తువులు బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించకుండా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సివిల్ సప్లై మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, డెయిరీ డెవలప్మెంట్ శాఖల అధికారులు పలు వ్యాపార సంస్థల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేసి రూ. 32,000 జరిమానా విధించామని వివరాలను వెల్లడించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు