మహబూబాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలురు మామిడి కాయలు తెంపారని చెప్పి దారుణంగా హింసించారు. వారి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి, కట్టెలతో కొడుతూ హింసించారు. అంతే కాకుండా ఆవు పెండను నోట్లో కుక్కి అతి దారుణంగా వ్యవహరించారు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు మండలం గుత్త తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ అనంతరం అందుకు బాధ్యులైన ఇద్దరు తోట కాపలా దారులపై కేసు నమోదు చేశారు. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు పరారీలో ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్