పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్

టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది అశ్వత్థామ చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించిన నాగశౌర్య ప్రస్తుతం వరుడు కావలెను, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రోజు నాగ శౌర్య బర్త్డే సందర్భంగా ఈ మూడు చిత్రాల నుండి ఆసక్తికర వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా లక్ష్య టీజర్ని విడుదల చేసి ఫ్యాన్స్లో ఆనందాన్ని పెంచారు.
లక్ష్య చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కగా, ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఆర్చరీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా నాగశౌర్య కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్మరార్, నారాయణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మొదటి త్రైమాసికంలో ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం విడుదలైన లక్ష్య టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మీరు టీజర్ని చూసి ఎంజాయ్ చేయండి.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు