బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 (Bigg Boss Telugu Season 5) ఎంటర్ టైనింగ్ గా మొదలైనప్పటికీ, గత బిగ్ బాస్ సీజన్ 4 కంటే తక్కువ టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. అయితే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న విషయాలు మాత్రం ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లహరి శారీ (Lahari Shari), మానస్ (Maanas)ల మధ్య రొమాంటిక్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది.
మానస్, లహరి శారి చేతికి మర్దన చేయడంతో రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. ఆ తరువాత లహరి శారీ త్వరలో పెళ్లి చేసుకోవాలని మానస్ ను అడుగుతుంది. తెలుగు మ్యాట్రిమొనీ యాడ్ హోర్డింగ్ వైపు సీన్ మారుతుంది. ప్రెస్టీజ్ కుక్కర్ బుక్ చేసుకోవాలని, ఆపై కపుల్స్ వీడియోలు చేస్తూ మోజ్ యాప్లో చేరవచ్చని చెప్తుంది లహరి. ఒత్తిడి లేని జీవితాన్ని గడిపేందుకు సువర్ణభూమిలో భాగం కావాలని మానస్ ను లహరి కోరే సన్నివేశం ఫన్ గా సాగుతూ అందరినీ నవ్విస్తుంది. ఆ తర్వాత అపాచీ బైకు చూసి అతని (మానస్)కోసం ఒకటి కొనాలని మానస్ ను అడుగుతుంది.
మరోవైపు గురువారం ఎపిసోడ్ లో ఉమా మహేశ్వరి, లోబోల లవ్ ట్రాక్, రొమాన్స్ మేజర్ హైలెట్స్ లో ఒకటి. ఉమా, లోబో ఎదురెదురుగా కూర్చొని ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరినీ చూసిన అనీ మాస్టర్ ఇదెక్కడి లవ్ ట్రాక్. చాలా కొత్తగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక మీది నటన అని తెలిసిపోతుంది..కొంచెం బాగా నటించండి అంటూ అక్కడికి వచ్చిన రవి ఆ ఇద్దరికి సూచించాడు. లోబో పట్ల నకిలీ ప్రేమను వ్యక్తపరచ కూడదని ఉమకు సలహా ఇచ్చాడు.
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్