లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు కథానాయికగా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. రాజకీయాల వలన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్గా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి అంతే రెస్పాన్స్ దక్కింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా ప్రచారం జరుగుతుంది. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారట. గ్రాండియర్గా తెరకెక్కించనున్న ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అన్నిటికి మించి ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ తమ సినిమాపై అంచనాలు పెంచాడు కొరటాల.
ఇవికూడా చదవండి..