శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ టైటిల్ చూస్తుంటే.. సినిమా ఆడవాళ్ల గురించే ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందని ఇప్పటికే దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పాడు. ఇదిలా ఉంటే.. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో మూడు మహిళా పాత్రలు కీలకంగా ఉండబోతుంది. ఆ మూడు పాత్రల్లో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారు. అప్పట్లో టాప్ హీరోయిన్లుగా చెలామణీ అయిన ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి ఈ పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే కొంత భాగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత తిరిగి ఈ సినిమా సెట్స్పైకి వచ్చింది. ఈ షెడ్యూల్లో శర్వానంద్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలతో పాటు కుటుంబ నేపథ్యంలో వచ్చే సీన్లను తెరకెక్కించబోతున్నారు. ఈ షూటింగ్లో ఖుష్బూ, రాధిక, ఊర్వశి కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆహ్వానిస్తూ ఫిల్మ్ మేకర్స్ వారి పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సీనియర్ నటీమణుల ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెంటిమెంట్ సీన్లలో వీళ్లు జీవించేస్తారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకి ఈ ముగ్గురి పాత్రలే చాలా కీలకమని.. అందుకే వీరిని ఎంపిక చేసుకున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లపై తన గౌరవాన్ని చాటుకున్నాడు హీరో శర్వానంద్. తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ను స్వయంగా ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్లకు వడ్డించి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్