ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ లో రామ్ పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, కృతి సనోన్ సీతగా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తన రోల్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రయూనిట్ ఘనంగా రావణుడికి వీడ్కోలు పలికింది. తాజాగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్ సైతం షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ చిత్రయూనిట్ కృతి సనన్కు ఘనంగా వీడ్కోలు పలికారు.
జానకి పాత్ర పోషిస్తున్న కృతి సనన్ పార్ట్ పూర్తైందని చెబుతూ.. డైరెక్టర్ ఓంరౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్నీ కృతిసనన్ కూడా ట్విట్టర్ మాధ్యమంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా కృతిసనన్ ఆదిపురుష్ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని కృతి సనన్ పేర్కొన్నారు. అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తిచేయాలని కసరత్తులు చేస్తున్నాడు ఓంరౌత్.