వరంగల్ : ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి. బ్యాంకు రుణ రికవరీ విషయంలో సొసైటీ చైర్మన్లు నిక్కచ్చిగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయ కర్ రావు అన్నారు. డీసీసీబీ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా 44 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మంత్రి నాబార్డు నుంచి మల్టీ సర్వీస్ బిజినెస్ చేయడం కోసం శనివారం హన్మకొండ అంబేడ్కర్ భవనంలో బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు అధ్యక్షతన చెక్కులు పంపణీ చేశారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా సహకార బ్యాంకు కరీంనగర్ బ్యాంకుకు దీటుగా అభివృద్ధి జరుగుతున్నది. ప్రభుత్వం తరుఫున అన్నివిధాల సహకారం ఉంటుందన్నారు. నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సహకార వ్యవస్థనే అని గుర్తు చేశారు. గత 25 ఏండ్ల నుంచి బ్యాంకు దెబ్బతిన్నది. రవీందర్ రావు పాలకవర్గం, ఉద్యోగుల కష్టపడి పనిచేయడంతో ఏడాది కాలంలో ఏడు కోట్ల లాభాలు వచ్చాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. రైతు పంటకోసం తీసుకున్నా రుణం తిరిగి సకాలంలో చెల్లిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, తాటికొండ రాజయ్య,నాబార్డ్ ఎండీ మురళీధర్, పాలక మండలి , పీఏసీస్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..