Cinema
- Dec 05, 2020 , 00:25:04
క్రిష్ ‘కొండపొలం’?

వైష్ణవ్తేజ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏకధాటిగా జరిగిన షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. రకుల్ప్రీత్సింగ్ కథానాయిక. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు టైటిల్ను కూడా ‘కొండపొలం’గా నిర్ణయించబోతున్నారని తెలిసింది. కరువు పరిస్థితిల్లో పోషణ కోసం గొర్రెల మందను అడవిలోకి తీసుకుపోయిన ఓ బృందం అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు, అరణ్యం నేపథ్యంలో అవగతమయ్యే జీవన సత్యాలు నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం.
తాజావార్తలు
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
MOST READ
TRENDING