గమ్యం చిత్రంతో దర్శకుడిగా మారిన క్రిష్ ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించాడు. స్టార్ హీరోలతో సైతం అద్భుతమైన సినిమాలు రూపొందించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం కరోనా వలన షూటింగ్కు బ్రేక్ పడింది. అయితే క్రిష్ ప్రొఫెషనల్ లైఫ్ సజావుగానే సాగుతున్నప్పటికీ, పర్సనల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్ అయింది.
క్రిష్ 2016 ఆగస్ట్ 7న రమ్య అనే డాక్టర్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నా సినిమా జీవితం ‘గమ్యం’తో మొదలైంది, నా అసలు జీవితం ఇప్పుడు ‘రమ్యం’గా మొదలవుతోంది… దానికి మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్ అతిధులను పెళ్లికి ఆహ్వానించారు. రెండేళ్లు వీరి సంసారం సజావుగానే సాగిన, ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారట. తన సినిమాలో నటించిన హీరోయిన్తో క్రిష్ చనువుగా ఉండడం రమ్యకు నచ్చకపోవడంతో విడాకులు ఇచ్చేసిందని అంటున్నారు. 2018లో వీరు కోర్టుని ఆశ్రయించగా, ఆ వెంటనే విడాకులు మంజూరు అయ్యాయి.