తెలుగు భాష, సాహిత్యం గొప్పదనాన్ని పాత తరం నుంచి నేటి తరం వరకు అందరికీ అర్థమయ్యే పదాలతో రాయగల గొప్ప టాలెంట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitaramasastri)సొంతం. సిరివెన్నెల రాసిన పాటలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మార్మోగిపోతుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ ఫేవరెట్గా నిలిచిపోతాయి. సిరివెన్నెల చిత్రంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు రాసి ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగా చెరగని ముద్రవేసుకున్నారు. ఈ చిత్రంలో చందమామ రావే జాబిల్లి రావే, ఈ గాలి ఈ నెల, విధాత తలపున పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. శ్రీనివాస కల్యాణంలో తుమ్మెద ఓ తుమ్మెద పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
స్వయం కృషి చిత్రంలో పారా హుషార్, రుద్రవీణలో నమ్మకు నమ్మకు ఈ రేయిని, తరలి రాద తనే వసంతంతోపాటు మిగిలిన పాటలు కూడా ఇప్పటికీ సూపర్ హిట్. బొబ్బిలి రాజాలో బలపం పట్టి భామ ఒళ్లో పాట ఎంతో ఫేమస్సో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కూలీ నెంబర్ 1 చిత్రంలో కొత్త కొత్తగా ఉంది అంటూ సంగీత ప్రేమికులను కొత్త లోకంలోకి తీసుకెళ్లారు సిరివెన్నెల. ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో అల్లంత దూరాన ఆ తారక ఆల్ టైమ్ హిట్.
అరవింద సమేతలో యేడ పోయినాడో, అల వైకుంఠపురంలో సామజవరగమన పాటలు సెన్సేషన్ సృష్టించాయి. సామజవరగమన పాటను తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషలకు చెందిన వారు కూడా ఎంజాయ్ చేశారు. అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ లో దోస్తీ పాటను సిరివెన్నెలే రాశారు.