సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, నరేన్, శరణ్య పొన్నవాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చిత్రపటం’. కవి బండారు దానయ్య దర్శకుడు. పుప్పాల శ్రీధర్రావు నిర్మాత. ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి సమాజంలో మనుషుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఈ చిత్రంలో చర్చిస్తున్నాం’ అన్నారు.