ఆదిలాబాద్ రూరల్ : హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న జూనియర్ బాయ్స్ నేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు రెఫరీగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల హ్యాండ్బాల్ కోచ్ అరవింద్ ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ కార్యదర్శి ప్రీతల్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అరవింద్ ఒక్కరు మాత్రమే ఎంపికయ్యారు. ఆయన ఇప్పటికే అనేకసార్లు జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి హ్యాండ్బాల్ క్రీడలో ఏడాది కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం కోచ్గా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలకు రెఫరీగా ఎంపికైన కోచ్ అరవింద్ను తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షకార్యదర్శులు జగన్మోహన్రావు, పవన్ కుమార్, జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోనె శ్యాంసుందర్రావు, కనపర్తి రమేశ్ అభినందించారు.