రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ గత మూడేళ్లుగా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్కు కరోనా అడ్డుపడుతుంది. వచ్చే ఏడాది ఆచార్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలుస్తుండగా, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాను మొదలు పెట్టనున్నాడు.
ఎన్టీఆర్ 30వ సినిమా తర్వాత కొరటాల శివ అక్కినేని హీరో అఖిల్తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే అఖిల్తో కథ గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తుండగా, వచ్చే ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.