బుల్లితెర అయిన వెండితెర అయిన ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్గా ఉన్నారు. ఈ షో తొలి ఎపిసోడ్కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్గా హాజరై తెగ సందడి చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించే సరికి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయారు.
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. తారక్ ముందు హాట్ సీట్లో కూర్చొని ఆడబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు వదిలారు. ఇందులో దర్శకులు ఇద్దరు రోల్ కెమెరా, యాక్షన్ అని చెబుతుండగా, ఎన్టీఆర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అనంతరం ఇక్కడ లొకేషన్ నాది, డైరెక్షన్ నాది. నేనే బాస్ ఇక్కడ అంటూ ఎన్టీఆర్ డైలాగులు విసురుతున్నారు.
సెప్టెంబర్ 20న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా, ఇది మంచి టీఆర్పీ రాబట్టనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు దర్శకులతో ఎన్టీఆర్కి మంచి బాండింగ్ ఉంది. రాజమౌళితో ఎన్టీఆర్ స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేశాడు. కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ చేయగా ఇది బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక త్వరలోనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయనున్నాడు.