ఎంవీ రెడ్డి పదవీ విరమణతో
విధుల్లోకి యువ ఐఏఎస్
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: దురిశెట్టి
కొత్తగూడెం మే 31: భద్రాద్రి జిల్లా నూతన కలెక్టర్గా దురిశెట్టి అనుదీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 14 నెలలపాటు ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన డాక్టర్ ఎంవీ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఇక్కడే అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దురిశెట్టి అనుదీప్కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కలెక్టర్గా కొనసాగనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో తొలి సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉందని, అదనపు కలెక్టర్గా కూడా చాలా నేర్చుకున్నానని అన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తానని అన్నారు. కరోనా సమయంలో వైరస్ ను అదుపు చేయడం కోసం అన్ని చర్యలూ తీసుకున్నట్లు చెప్పా రు. అందరి సహకారంతో ముందుకు వెళతానని అన్నారు.
ఐఏఎస్ టాపర్గా..
జగిత్యాల జిల్లా మెట్పల్లి చెందిన అనుదీప్ 2018లో సివిల్ సర్వీసెస్లో ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించి సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలందుకున్నారు. అంతకుముందు అనుకున్న ర్యాంకు రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగు సార్లు సివిల్స్ రాశారు. ఆయన తల్లి జ్యోతి. తండ్రి ఏఈగా ఉద్యోగం చేస్తూ కొడుకును చదివించారు. ఏడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని అయన ఇప్పటికీ చెబుతుంటారు.