కరోనా కట్టడికి మంత్రి కేటీఆర్ చర్యలు
అమాత్యుడి సూచనతో 22,500 సిరప్లు అందజేసిన రీచ్ ఇండియా కంపెనీ
నేటి నుంచి ఇంటింటికీ పాజిటివ్ రోగులకు పంపిణీకి చర్యలు
డీఎంహెచ్ సుమన్మోహన్రావు వెల్లడి
సిరిసిల్ల టౌన్, మే 21: రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మంత్రి కేటీఆర్ సూచనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీలో భాగంగా హైదరాబాద్కు చెందిన రీచ్ ఇండియా బయో అప్లికేషన్ కంపెనీ 22,500ల సిరప్లను జిల్లాకు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో సుమన్మోహన్రావు మాట్లాడు తూ, ప్రభుత్వ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి చేపట్టిన ఫీవర్ సర్వేలో గుర్తించిన కరోనా పాజిటివ్ రోగులకు ఈ సిరప్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 4వేలకు పైగా కరోనా పాజిటివ్ రోగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒక్కో రోగికి ఒక సిరప్ను అందజేస్తామని, వారానికి ఒకరోజు నెలకు నాలు గు సార్లు రోగి సిరప్ను తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 16 పీహెచ్సీలకు ఈ సిరప్లను సరఫరా చేస్తున్నామన్నారు. ఆయా పీహెచ్సీల పరిధిలో పని చేసే సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వేలో గుర్తించిన రోగులకు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన సిరప్లను అందజేశామని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు ఈ విటమిన్ డీ3 సిరప్ తాగడం ద్వారా వారికి అవసరమైన ఇమ్యూనిటీ స్థాయి పెరుగుతుందన్నారు. కాల్షియం, శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు పనిచేయు విధానం మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న విటమిన్ డీ3 సిరప్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ డాక్టర్ మీనాక్షి, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది జలపతి, తదితరులు ఉన్నారు.