మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, రెడ్యానాయక్, హరిప్రియానాయక్, కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి కరోనాపై ఆమె గురువారం సమీక్ష నిర్వహించారు.