లండన్ : వచ్చే నెల 3, 4 తేదీలలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరుగనున్న జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ సమావేశాన్ని వర్చువల్గా జరుపనున్నారు. ఈ విషయాన్నిబ్రిటిష్ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. కొవిడ్-19 కి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటంలో తన పాత్ర కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సమావేశం నిర్వహణ కోసం ఎంపిక చేశారు.
ఈ సమావేశంలో ప్రపంచ ఆరోగ్య భద్రత, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్, క్లినికల్ ట్రయల్స్, డిజిటల్ హెల్త్ తదితర అంశాలపై చర్చించనున్నారు. వారం రోజుల తర్వాత జూన్ 11-13 తేదీల్లో కార్న్వాల్లో జరుగనున్న జీ-7 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ఇక్కడ చర్చించిన అంశాలను తెలియజేస్తారు. బ్రిటన్ ప్రెసిడెన్సీ క్రింద ఈ శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది.
ఈ బృందంలో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఈ దేశాల ఆరోగ్య మంత్రులు వ్యక్తిగతంగా హాజరవుతారు. జీ-7 ప్రెసిడెన్సీకి ఆహ్వానించబడిన దేశాలతో రెండు రోజుల చర్చల్లో భారత్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పాల్గొంటాయని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది.
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్కు పితృవియోగం
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..