బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లు తెలుగులో హవా కొనసాగించడం కొత్తేమి కాదు. అలాంటి హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. సౌతిండియా ఫిలిం ఇండస్ట్రీ (Southindia Film Industry) కొంత కాలంగా మలయాళం, తమిళం, కన్నడ హీరోయిన్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఉత్తరాది భామలు తెలుగు స్క్రీన్ పై తమ హవా చాటే ప్రయత్నం చేస్తున్నారు. నార్తిండియన్ భామల్లో బాలీవుడ్ ట్యాగ్ లేకుండా ఇక్కడ పాపులారిటీ పెంచుకునేవారున్నారు.
పుట్టింది ఉత్తరాదిన అయినా తెలుగు హీరోయిన్లుగా సెటిల్ అవుతున్నారు. ఇపుడు టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఏర్పడటంతో మళ్లీ బాలీవుడ్ హీరోయిన్లవైపు చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆఫర్లు వస్తున్న వారిలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani) ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్షా సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు నిర్మాతలు దాదాపు అదే మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదన్న వార్త అటు బీటౌన్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటి వరకు నయనతార (Nayanatara) మాత్రమే ఇంత మొత్తంలో పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఉండగా..ఇప్పటివరకు ఎవరూ ఆమెను అధిగమించలేదు. తాజా పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే కియారా అద్వానీ దక్షిణాదిన అధికారికంగా రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుని నయనతారకు గట్టి పోటీనివ్వడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర