యశ్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. మూడేళ్ల క్రితం విడుదలై అద్వితీయ విజయాన్ని సాధించిన ‘కేజీఎఫ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ను జూలై 16న విడుదలచేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే కరోనా ప్రభావంతో సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమయ్యాయి. మరోవైపు సెకండ్వేవ్ మూలంగా చాలా రాష్ర్టాల్లో థియేటర్లు మూతపడ్డాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జూలైలో కాకుండా సెప్టెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదలచేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యశ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. సంజయ్దత్, రవీనాటండన్, రావురమేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.