మూగ జీవాలను ప్రేమించడానికి మంచి మనసు ఉండాలి. మనుషులను ప్రేమిస్తారో లేదో తెలియదు కానీ కొందరు మాత్రం జంతువులను బాగా ఇష్టపడుతుంటారు. వాటికి కావాల్సిన ప్రతీ ఒక్కటి సమకూరుస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు అలాంటి ప్రముఖులు ఉన్నారు. అక్కినేని అమలనే తీసుకుంటే జంతు సంరక్షణ కోసం ఏకంగా ఓ సంస్థనే మొదలు పెట్టింది. అలాగే రష్మి గౌతమ్ కూడా ఎప్పుడు చూసినా మూగ జీవాల కోసమే సమయం కేటాయిస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ ఓ హీరోయిన్ ఇదే చేస్తుంది. ఆమె ఎవరో కాదు శ్రీనిథి శెట్టి. ఇలా చెప్తే ఎవరూ గుర్తు పట్టరు. అదే కెజియఫ్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తు పడుతుంటారు. మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చిన శ్రీనిధి శెట్టి.. కెజియఫ్ సినిమాతో పాపులర్ అయింది. తొలి సినిమాతోనే స్టార్ అయిపోయింది.
కెజియఫ్ తర్వాత కన్నడలో బాగానే పాపులర్ అయింది ఈ బ్యూటీ. అయితే అవకాశాలు మాత్రం రావడం లేదు. కెజియఫ్ తర్వాత పార్ట్ 2 లో నటిస్తుంది శ్రీనిధి. అలాగే తమిళనాట విక్రమ్ హీరోగా నటిస్తున్న కోబ్రాలోనూ శ్రీనిధి నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లేగదూడతో ఈమె ఇచ్చిన పోజులు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ముద్దు పెడుతూ అమ్మడు వయ్యారంగా పోజులిచ్చింది. వీటిని చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. పర్లేదు.. అమ్మడుకు జంతు ప్రేమ కూడా బాగానే ఉందే అంటూ ప్రశంసిస్తున్నారు.